న్యాయస్థానం గతంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకూడదని పతంజలి సంస్థను మందలించింది. ఆ హామీని ఉల్లంఘించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వివరణ ఇవ్వాలంటూ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు పతంజలి స్పందించకపోవడం వల్ల రామ్దేవ్ బాబా, బాలకృష్ణలు కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. అందులో భాగంగానే వారిద్దరూ ఏప్రిల్ 2న హాజరయ్యారు. అప్పుడు కూడా క్షమాపణలు అంగీకరించమని కోర్టు స్పష్టం చేసింది.