జనసేన అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు పట్టణానికి చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో తణుకు మహిళా డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఆయన దిగారు. మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి తణుకు 'ప్రజాగళం' బహిరంగ సభలో పవన్ పాల్గొననున్నారు.