వర‌ద నీటిలో కూర్చుని వినూత్నంగా నిర‌స‌న తెలిపిన మ‌హిళ

61చూసినవారు
వర‌ద నీటిలో కూర్చుని వినూత్నంగా నిర‌స‌న తెలిపిన మ‌హిళ
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. నాగోలు–బండ్లగూడ రహదారిపై ఉన్న గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో.. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నిరసన తెలిపింది. రోడ్డు పక్కనే ఉన్న వరద నీటి గుంతలో కూర్చొని నిరసన చేపట్టింది. కొత్త రోడ్డును నిర్మించాలని డిమాండ్ చేసింది. రోడ్డును పూర్తి చేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు హామీ ఇస్తేనే దీక్ష విరమిస్తానని నిరసన వ్యక్తం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్