రాజస్థాన్లో ఓ దారుణ సంఘటన చోటుచేసుకున్నట్టు తాజాగా ఓ కథనం వైరల్ అవుతోంది. అన్నయ్య భార్య తమ్ముడి బిడ్డలకు విషం ఇచ్చిందని, సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నేషనల్ కమిషన్ ఫర్ మెన్ ఎన్జీవో ఈ వీడియో పోస్ట్ చేసింది. ఆ పసిబిడ్డను మూడు రోజుల పాటు ఐసీయూలో ఉంచారని, చిన్నారి ప్రస్తుతం క్షేమంగా ఉందని కమిషన్ తెలిపింది. అయితే ఈ ఘటనపై బార్మర్ పోలీసులు స్పందించి ఆ కుటుంబం అలాంటి సంఘటన జరగలేదని ఖండించినట్టు తెలిపారు.