లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హిమాచల్ప్రదేశ్లోని మండీలో నిర్వహించిన ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థానిక భాజపా అభ్యర్థి కంగనా రనౌత్ యువత, ఆడబిడ్డల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. ఆమెపై కాంగ్రెస్ నేతలు ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు మండి, హిమాచల్కే అవమానకరమని, దీనికి ఓటర్లు తగిన సమాధానం చెప్పాలన్నారు. కంగనా మీ గొంతుకగా మారతారని, మండి అభివృద్ధికి పాటుపడతారని హామీ ఇచ్చారు.