గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైనా .. ఆర్నెల్లు తిరక్క ముందే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సత్తా చాటారు. అసెంబ్లీ ఎన్నిలకల్లో ఓడిన బండి సంజయ్ లోక్సభ ఎన్నికల్లో 2.12లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఓడిన రఘునందన్ రావు.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి మెదక్ గడ్డపై కాషయం జెండా ఎగరేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఈటల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.