'అవార్డు గ్రహితలను సన్మానించడం ఇదే తొలిసారి'

75చూసినవారు
శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పద్మవిభూషణ్ గ్రహిత మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ అవార్డులు ప్రకటించిన వెంటనే ఇలా సన్మానం చేయడం ఇదే తొలిసారి అని అన్నారు. అవార్డులు కళాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయని స్పష్టం చేశారు. గద్దర్ పేరుతో నంది అవార్డులు ఇవ్వనుండటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు.

సంబంధిత పోస్ట్