ఢిల్లీ పోలీసులు రాకపై సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే

23317చూసినవారు
గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు రావడంపై సీఎం రేవంత్ స్పందించారు. 'ఢిల్లీ పోలీసులకు భయపడేది లేదు. ప్రశ్నిస్తున్న వారిపై ఈడీ, సీబీఐ, ఐటీని ప్రయోగించడం అయిపోయింది. ఇప్పుడు ఢిల్లీ పోలీసులను రంగంలోకి దించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం చేయాలని చూస్తున్నారు. బీజేపీపై పోరాడే వారికే అమిత్ షా నోటీసులు ఇస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులు వస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం' అని రేవంత్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్