ఆ నేత‌లే ప్ర‌భుత్వాన్ని కూలుస్తారు.. కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

101681చూసినవారు
కార్యకర్తల ఉత్సాహం చూస్తే ఎందుకు ఓడిపోయామో అర్థం కావట్లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు .‘‘కాంగ్రెస్‌ మాటలు విని మోసపోయామని వందరోజుల్లోనే ప్రజలు గ్రహించారు. రూ.2 లక్షల రుణమాఫీ ఇంకా ఎందుకు చేయలేదు. రుణమాఫీ జరిగితే కాంగ్రెస్‌కు ఓటు వేయండి. రుణమాఫీ రాకుండా మోసపోతే బీఆర్ఎస్‌కు ఓటు వేయండి. ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకు లేదు. నల్గొండ, ఖమ్మం నేతలే ప్రభుత్వాన్ని కూలుస్తారు. కూల్చే నేత‌లు కాంగ్రెస్‌లోనే ఉన్నారు’’ అని కేటీఆర్‌ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్