బెంగళూరు శివారులో హోలీ వేడుకలలో భాగంగా జరిగిన గొడవలో ముగ్గురి మరణించారు. బీహార్కు చెందిన ఆరుగురు బెంగళూరులో కూలీలుగా పనిచేస్తున్నారు. అయితే హోలీ పండుగ సందర్భంగా ఆరుగురు మందు పార్టీ జరుపుకున్నారు. ఈ పార్టీలో ఓ మహిళ గురించి వివాదం చెలరేగడంతో ఒకరినొకరు కర్రలు, రాడ్లతో తలలు పగలగొట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.