పిడుగుల బీభత్సం.. ముగ్గురు మహిళ‌లు మృతి

79చూసినవారు
పిడుగుల బీభత్సం.. ముగ్గురు మహిళ‌లు మృతి
TG: తెలంగాణ‌లో విషాదం నెల‌కొంది. ఉమ్మ‌డి వరంగల్ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఉమ్మ‌డి జిల్లాలోని రెండు చోట్ల పిడుగులు పడి ముగ్గురు మహిళా కూలీలు మృతిచెందారు. ఆత్మకూరు మండ‌లం చౌవులపల్లి వద్ద పత్తి చేనులో వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగు పడి అత్తాకోడ‌ళ్లు రామ‌, నిర్మ‌ల‌ మృతి చెంద‌గా.. రేగొండ మండ‌లం రంగ‌య్య‌ప‌ల్లి గ్రామంలో పిడుగుపాటుకు ల‌క్ష్మి అనే మ‌హిళా రైతు మృతిచెందింది.

సంబంధిత పోస్ట్