దేశంలో ఐదవ విడత ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడనుంది. ఈ ఫేజ్లో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మే 20 న పోలింగ్ జరగనుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని 14 నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల్లో రాజ్నాథ్ సింగ్ లాంటి ప్రముఖులు బరిలో ఉన్నా.. రాయ్బరేలీ నుంచి బరిలోకి దిగిన రాహుల్ గాంధీ, అయోధ్య ఉన్న ఫైజాబాద్లపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.