నేటి మ్యాచ్ విరాట్ కోహ్లీకి 300వ వన్డే

64చూసినవారు
నేటి మ్యాచ్ విరాట్ కోహ్లీకి 300వ వన్డే
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం భారత్-న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. కాగా, ఈ మ్యాచ్ భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి 300వ వన్డే కానుంది. 2017లో 200వ వన్డేను కూడా న్యూజిలాండ్‍పైనే ఆడిన కోహ్లీ ఆ మ్యాచ్‍లో సెంచరీ చేశాడు. ఇప్పుడు 300వ మైల్‍స్టోన్ వన్డేకు కూడా న్యూజిలాండ్‍తోనే ఆడుతున్నాడు. దీంతో ఈ మ్యాచ్‍లో కోహ్లీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాక్‌పై సెంచరీ చేసిన కోహ్లీ నేడు కూడా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్