జమ్మూకశ్మీర్లోని గుల్మార్గ్, పూంచ్, రాజౌరీ, శ్రీనగర్, కుప్వారా, ఉదంపూర్ తదితర ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. హిమపాతం పడటం వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బారాముల్లా-బనిహాల్ మధ్య రైల్వే ట్రాక్పై భారీగా మంచు పేరుకుపోయింది. దాంతో భారత రైలు ఆ మంచు పై నుంచి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ప్రకృతి అందం చూడముచ్చటగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.