దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్లో జరుగనుంది. ఈ క్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ట్రాన్స్జెండర్ వర్గానికి చెందిన పలువురిని ఆహ్వానించారు. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న ట్రాన్స్జెండర్లలో ఒకరు మాట్లాడుతూ.. ట్రాన్స్జెండర్ల హక్కులకు ప్రభుత్వం మద్దతుగా నిలవడం సంతోషంగా ఉందని అన్నారు.