ఉత్తరప్రదేశ్లోని బులంద్హర్లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఇద్దరమ్మాయిలు నాలుగేళ్లగా సహజీవనం చేస్తున్నారు. కానీ ఒక యువతి అబ్బాయితో నిశ్చితార్థం చేసుకుంటుండంతో విషయం తెలుసుకున్న మరో అమ్మాయి ఫంక్షన్ హాల్కు వచ్చి రచ్చ చేసింది. వధువును తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. బంధువులు, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో వరుడు నిశ్చితార్థం రద్దు చేసుకున్నాడు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు అయింది.