రంజీలో ఒకే రాష్ట్రం నుంచి స్టేడియంలోకి రెండు జట్లు

1052చూసినవారు
రంజీలో ఒకే రాష్ట్రం నుంచి స్టేడియంలోకి రెండు జట్లు
రంజీ టోర్నీ ప్రారంభమైన తొలి రోజే ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పట్నా వేదికగా ముంబైతో మ్యాచ్‌ కోసం బిహార్‌ నుంచి రెండు జట్లు మైదానం వద్దకు చేరుకున్నాయి. దీంతో బిహార్ వివాదం మరోసారి బయటపడింది. రెండు జట్లలో ఒకదానిని బిహార్ క్రికెట్ అసోసియేషన్‌ (BCA) అధ్యక్షుడు రాకేశ్‌తివారీ ఎంపిక చేయగా, రెండో టీమ్‌ కార్యదర్శి అమిత్ కుమార్‌ నేతృత్వంలో సిద్ధమైంది. చివరికి అధ్యక్షుడు ఎంపిక చేసిన జట్టునే రంజీ వర్గాలు అనుమతించాయి.

సంబంధిత పోస్ట్