AP: బెయిల్ కావాలంటూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ ఎస్సీ ,ఎస్టీ స్పెషల్ కోర్టును ఆశ్రయించారు. వంశీ తరుపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు కోర్టు ఆదేశించింది. అయితే, వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఇంకా 3 రోజులు టైం కావాలని పీపీ కోరారు. దీంతో న్యాయస్థానం తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.