కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో మంగళవారం సాయంత్రం షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు తన బైక్పై వెళ్తుండగా మార్గమధ్యంలో అతడికి ఊహించని అనుభవం ఎదురైంది. హెడ్లైట్ వద్ద చిన్న కొండచిలువ ఉండడాన్ని ఆ యువకుడు గమనించాడు. దీంతో వెంటనే బైక్ ఆపి పరుగులు పెట్టాడు. అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఆ కొండచిలువను బయటకు తీశారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో దానిని వదిలేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.