ఏపీలోని నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల మండలంలో విషాదం చోటుచేసుకుంది. గొర్విమానుపల్లెకు చెందిన మహేంద్ర అనే యువకుడు గుత్తి రైల్వే స్టేషన్ లో రైలు కిందపడి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం మేరకు రైల్వే SI నాగప్ప కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మహేంద్ర గతంలో వాలంటీర్ గా పనిచేసి, ప్రస్తుతం పెన్నా సిమెంట్లో పనిచేస్తున్నాడు. యువకుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.