గోకుల్ నగర్ లో పర్యటించిన డీకే అరుణ

65చూసినవారు
కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలం గోకుల్ నగర్ గ్రామంలో బుధవారం బిజెపి ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె బిజెపి పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. దేశం అన్నివిధాలుగా అభివృద్ధి చెందాలంటే మోడీని 3వ సారి ప్రధానమంత్రి చేయాలని, ప్రతి ఒక్కరూ కమలం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కావలి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్