సహజ రంగులపై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన

50చూసినవారు
ఆనందాన్ని పంచే హోలీ పండుగ కోసం కోస్గి మండలం ముశ్రీఫా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు శనివారం ఆరోగ్యకరమైన సహజ రంగులను తయారుచేశారు. ఎర్త్ క్లబ్ సమన్వయకర్త వార్ల మల్లేశం సహజ రంగుల తయారీ- పర్యావరణ రహిత హోలీ అనే అంశంపై విద్యార్థులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పుల్లప్ప, ఉపేందర్, మాధవరెడ్డి, రాజశేఖర్, నరసింహారెడ్డి, శకుంతల, సుధా, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్