కట్టుదిట్టంగా పార్లమెంట్ ఎన్నికలు పూర్తి చేయాలి

65చూసినవారు
కట్టుదిట్టంగా పార్లమెంట్ ఎన్నికలు పూర్తి చేయాలి
డబ్బు, మద్యం అక్రమంగా సరిహద్దులు దాటకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని పార్లమెంట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజీవ్ చోప్రా(ఐఆర్ఎస్) అన్నారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తాండూరు నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన అంతర్ రాష్ట్ర చెక్’ పోస్టులను గురువారం ఆయన సందర్శించారు. అక్రమంగా మద్యం, డబ్బు, సంఘ విద్రోహ శక్తుల సంచారం లేకుండా చూడాలని, అలాంటివి ఏమైనా సరిహద్దు దాటకుండా దృష్టిసారించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్