దుద్యాల మండల కేంద్రంలో జోరుగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం

51చూసినవారు
దుద్యాల మండల కేంద్రంలో జోరుగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా దుద్యాల మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీలతో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మెరుగు వెంకటయ్య శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే 5 హామీలను అమలు చేసిందని ఆగస్టు 15 లోపల రెండు లక్షల రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆయన తెలిపారు. అలాగే మిగిలిన హామీలన్నీ అమలు చేస్తుందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్