ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై గెలిచి భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. కాగా భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. విరాట్ కోహ్లీ 98 బంతుల్లో 5 ఫోర్లతో అద్భుతంగా ఆడి 84 పరుగులు చేశాడు. ఈ విజయంతో 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఓటమికి కంగారూలపై భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.