AP: పల్నాడు జిల్లాలో పెన్షన్ డబ్బుతో పరారీలో ఉన్న దాచేపల్లి సచివాలయ ఉద్యోగి లక్ష్మీ ప్రసాద్ సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. ఆన్లైన్ బెట్టింగ్తో మోసపోయానని, నెల రోజులు సమయం ఇస్తే డబ్బులు చెల్లిస్తానని చెప్పాడు. దీనిపై మంత్రి లోకేష్ స్పందించారు. మనుషులు తప్పులు చేస్తారని, వారికి రక్షణ కల్పిస్తామని, వారు సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలని ఆయన అన్నారు. బెట్టింగ్ యాప్లలో చిక్కుకోవద్దని ఆయన ప్రజలకు సూచించారు.