లోక్సభ ఎన్నికల వేళ ప్రధాని మోదీపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్లో ప్రభుత్వం నియంతృత్వాన్ని ప్రయోగిస్తోందని, ప్రధాని మోదీ మూడోసారి మళ్లీ అధికారంలోకి రావడం 'ప్రమాదకరం' అని హెచ్చరించారు. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను జైల్లో పెట్టారని, దేశంలో నియంతృత్వాన్ని తీసుకురావాలనుకుంటున్న ఈ ప్రభుత్వాని ఓటు వేయవద్దని కోరారు.