కేటీకే ఓపెన్కాస్ట్ గని - 3 విస్తరణలో భూములు కోల్పోయిన గణపురం మండలం కొండంపల్లి గ్రామ భూ నిర్వాసితులకు భూ చట్టం ప్రకారం పరిహారాన్ని అందించేలా కృషి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ హాల్ లో సింగరేణి ఓసి - 3 భూసేకరణలో భూములు కోల్పోయిన కొండంపల్లి గ్రామస్తులతో జరిగిన డి వైల్ ఎన్ సి లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.