భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పోలారం గ్రామశివారు అటవీ ప్రాంతంలో ఎర్రోళ్ల లక్ష్మీనారాయణ అనే వ్యక్తి గుడుంబా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, గుడుంబా తయారు చేస్తున్నట్లు సమాచారంతో, మహాముత్తారం ఎస్సై, సివిల్, సిఆర్పిఎఫ్ సిబ్బందితో దాడులు చేశారు. 400 లీటర్ల జాగరీ వాష్ ధ్వంసం చేసి, 60 లీటర్ల గుడుంబాను సీజ్ చేశారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ ఆదివారం తెలిపారు.