Mar 31, 2024, 17:03 IST/జనగాం
జనగాం
వడ్డెరులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
Mar 31, 2024, 17:03 IST
తెలంగాణ వడ్డెర సంఘం, వడ్డెర చారిటబుల్ ట్రస్ట్ ల ఆధ్వర్యంలో జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డిని కల్సి వడ్డెర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతిపత్రాన్ని అందించారు. ఆదివారం ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ అధ్యక్షులు పల్లపు శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి వడ్డెర కులాన్ని మర్చి పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.