ప్లాట్లను కొనుగోలు చేసిన యజమానుల ఆందోళన

85చూసినవారు
జనగాం జిల్లాలోని పెద్ద రామ్ చర్ల గ్రామంలో ఓ ప్రైవేటు వెంచర్ లో ప్లాట్లను కొనుగోలు చేసిన యజమానులు ఆందోళనకు దిగారు. తాము కొనుగోలు చేసిన భూములలోనికి సంబంధంలేని వ్యక్తులు వచ్చి దౌర్జన్యంగా చొరబడి భూమి హద్దులను మార్చడమే కాకుండా తోరణాన్ని కూల్చివేశారని బుధవారం ఆందోళన చేపట్టారు. దళారులు, దౌర్జన్యపరులకు వ్యతిరేకంగా నిరసన నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్