ఎన్నికల నిర్వహణలో అధికారులు పారదర్శకంగా పని చేయాలని భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు సయాన్ దేబర్మ అన్నారు. శనివారం జనగాం జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఉప ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ సీతారాంలతో కలిసి ఆయన ఎన్నికల విధుల నిర్వహణపై నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.