వృధాగా పోతున్న మిషన్ భగీరథ మంచినీరు
కాజీపేట మండలం మడికొండ గ్రామం మంగళవారం 64వ డివిజన్ పరిధి యూనియన్ బ్యాంక్ దగ్గర్లో మిషన్ భగీరథ మంచినీరు గత కొన్ని రోజుల నుంచి వృధాగా పోవుచున్నది. గత కొన్ని రోజుల నుండి విపరీతమైన ఎండ వేడి ఉక్కపోతకు నగర ప్రజలు అల్లాడుతున్నారు. నీటి బొట్టు ఒక్కొక్క చుక్క చాలా విలువైనది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ నీటి వృధాను అరికట్టాలని స్థానికులు కోరుచున్నారు.