పల్లెప్రకృతి వనాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ శ్రీజ

52చూసినవారు
పల్లెప్రకృతి వనాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ శ్రీజ
ములుగు జిల్లా కేంద్రంలోని పల్లె ప్రకృతి వనాన్ని, నర్సరీని అదనపు కలెక్టర్ శ్రీజ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ. పచ్చదనం పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి మండలంలో సుమారు 5 నుంచి 10 ఎకరాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనంను ఏర్పాటు చేసిందన్నారు. వేసవి కాలం దృష్ట్యా మొక్కలకు నీరు అందించాలన్నారు.