ఛత్తీస్ ఘడ్ వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు

574చూసినవారు
ఛత్తీస్ ఘడ్ వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు
ఛత్తీస్ ఘఢ్ నుండి తెలంగాణలోకి వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ములుగు జిల్లా వాజేడు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తుగా తనిఖీలను ముమ్మరం చేశామన్నారు. ఇందులో భాగంగా మంగళవారం పాయపట్ల గ్రామం వద్ద ప్రధాన రహదారిపై ఛత్తీస్ ఘడ్ వైపు నుండి తెలంగాణలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి వివరాలను సేకరిస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్