ఐటిడిఏ ముందు ధర్నాను విజయవంతం చేయాలి: గిరిజన జేఏసి

58చూసినవారు
ఐటిడిఏ ముందు ధర్నాను విజయవంతం చేయాలి: గిరిజన జేఏసి
ఐటిడిఏ పరిధిలోని ఆశ్రమ, యూపిఎస్, జిపిఎస్ పాఠశాలలో బదిలీలు, ప్రమోషన్ల విషయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరగడంలేదని గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం జేఏసి నాయకులు తెలిపారు. ఐటిడిఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 28న ఐటిడిఏ ముందు గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులు జేఏసి ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్