వ్యాధి మూలాన్ని గుర్తించేది హోమియో పతి వైద్యమని, సూక్ష్మమైన హోమియో పతి గుళికలతో వ్యాధులు నయం చేయవచ్చని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం ములుగులో ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ. దీర్ఘకాల వ్యాధులను, ఇతర పలురకాల వ్యాధులను హోమియోపతి మందుల ద్వారా తక్కువ ఖర్చుతో నయం చేసుకునే అవకాశం ఉందన్నారు.