మల్లూరు గుట్టపై గత 4 రోజులుగా కార్చిచ్చు

585చూసినవారు
ములుగు జిల్లా మంగపేట మండలం లక్ష్మీనరసింహస్వామి కొలువైన మల్లూరు గుట్టల్లో కార్చిచ్చుతో 4 రోజులుగా మంటలు వ్యాపిస్తున్నాయి. అటవీశాఖ అధికారులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేపట్టకపోవడంతో సమీప గ్రామాలు పొగతో కమ్ముకుంటున్నాయి. మంటల కారణంగా గుట్టపై అరుదుగా లభించే వేల రకాల ఆయుర్వేద వనమూలికలు, వృక్షజాతులు అంతరించే పోయే ప్రమాదం ఉందని, అధికారులు మంటలను అదుపు చేయాలని మంగళవారం స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్