డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: ఎస్పీ

1042చూసినవారు
ములుగు జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఎస్పీ శబరీశ్ అన్నారు. జిల్లాలోని పోలీస్ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దుల నుండి గంజాయి వంటి డ్రగ్స్ సరఫరాను అరికట్టాలన్నారు. ఆదివాసీలకు గంజాయి వాడకం, దుష్ఫలితాలను వివరిస్తూ.. అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ విషయాలపై పోలీసులు దృష్టి పెట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్