ఎండతీవ్రత నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ళల్లో నుండి బయటికి రాకూడదని, ఎండ తీవ్రతకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని మంత్రి ప్రజలకు సూచించారు.