ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మచ్చాపూర్ సమీపంలోని 163వ జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి వస్తున్న వాహనం గోవిందరావుపేట మండలం మచ్చాపూర్ గ్రామ సమీపంలో అదుపుతప్పి లారీని ఢీ కొట్టడంతో వాహనం పల్టీలు కొట్టింది. వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా వారిని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.