ఎకో టూరిజం అభివృద్ధి కోసం ఏటూరు నాగారం అభయారణ్యం ఎంపిక

65చూసినవారు
ఎకో టూరిజం అభివృద్ధి కోసం తెలంగాణలోని ఏడు అటవీ ప్రాంతాలను గుర్తించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గురువారం అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాకాల, ములుగు జిల్లాలోని ఏటూరునాగారం అభయారణ్యం ప్రాంతాలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్