అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు: ఎస్సై తాజుద్దీన్

54చూసినవారు
మతసామరస్యానికి ప్రతీక వినాయక చవితి పండుగ అని ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్ అన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని పలు గణేశ్ విగ్రహాల వద్ద ఎస్సై తాజుద్దీన్ ప్రత్యేక పూజలు ఆదివారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గణేశ్ నిమజ్జనం శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. మద్యం సేవించి అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్