నామినేషన్ల స్వీకరణ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్

63చూసినవారు
నామినేషన్ల స్వీకరణ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్
లోక్ సభ ఎన్నికలు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. బుధవారం ములుగు జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నామినేషన్ల స్వీకరణ, తుది ఓటరు జాబితా రూపకల్పనపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్