రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలి

72చూసినవారు
రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలి
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈనెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు యువ నేతాజీ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తకొండ అరుణ్ కుమార్ తెలిపారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 14న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్