సీఎంని మర్యాదపూర్వకంగా కలిసిన వేల్పుకొండ వెంకటేష్

667చూసినవారు
సీఎంని మర్యాదపూర్వకంగా కలిసిన వేల్పుకొండ వెంకటేష్
రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో అద్భుత పథకాలకు రూపకల్పన చేసిన నాయకుడు, రైతు కష్టాలను తెలుసుకున్న వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అని ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ కన్వీనర్, భారత రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్చుకొండ వెంకటేష్ అన్నారు. భారత రాష్ట్ర సమితి జాతీయ పార్టీ కార్యాలయం ఢిల్లీలో ప్రారంభోత్సవం జరు పుకున్న సందర్భంగా జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రము ఖ్యమంత్రివర్యులు కేసీఆర్ ని, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆశీస్సుల తో ఢిల్లీలోని వారి నివాసంలో ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ కన్వీనర్, భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్పుకొండ వెంకటేష్ గురువారం కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్ప గుచ్చం అందజేశారు. భారత రాష్ట్ర సమితి నూతన కండువాను జాతీయ అధ్యక్షు లు కేసీఆర్ వేల్పుకొండ వెంకటేశ్ కు వేయడం జరిగినది. అనంతరం సీఎం ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వేల్పుకొండ వెంకటేష్ మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రావడం శుభపరిణామమన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే కేసీఆర్ నాయకత్వంతోనే సాధ్యమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్