May 15, 2024, 04:05 IST/పాలకుర్తి
పాలకుర్తి
అనారోగ్యంతో వృద్ధురాలు మృతి
May 15, 2024, 04:05 IST
తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన లింగాల నర్సమ్మ (80) అనే వృద్ధురాలు అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. వృద్ధురాలికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. నర్సమ్మ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు కందాడి అచ్చిరెడ్డి, అమ్మాపురం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముద్దం వీరారెడ్డి, ఎంపీటీసీ డోనుక ఉప్పలయ్య, పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మార్క శ్రీనివాస్ గౌడ్, బూరుగు వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.