పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండల పర్యటనలో భాగంగా శనివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులతో ఎర్రబెల్లి మాట్లాడి రైతులు పంటలను సాగుకు నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.