భారత రాష్ట్ర సమితి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా పాలకుర్తి మండల కార్యకర్తలు వేలాదిగా తరలి రావాలని మెట్టు శ్రీనివాస్ కోరారు. శనివారం జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన ఉదయం 11 గంటలకు హన్మకొండలోని వరంగల్ కలెక్టర్ ఆఫీస్ లో నామినేషన్ దాఖలు చేస్తారని తెలిపారు.