జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఈద్గాలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఒకరికొకరు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆ అల్లా ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.